మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో ‘రచ్చ’ సినిమా చేయగానే సంపత్ నందికి పవన్ కళ్యాణ్ నుండి పిలుపు వచ్చింది.తన ‘గబ్బర్సింగ్`2’కు నువ్వే దర్శకుడివి అంటూ సంపత్ నందితో పవన్ అన్నాడు.
దాంతో ఉబ్బి తబ్బిబయ్యాడు సంపత్.పవన్తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా స్టార్ డైరెక్టర్ అవుదామా అంటూ దాదాపు రెండు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు.
ఎంతకూ ‘గబ్బర్సింగ్`2’ సెట్స్పైకి వెళ్లక పోవడంతో ఓపిక నశించి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.సంపత్ నంది తప్పుకున్న స్థానంలో ‘పవర్’ ఫేం బాబీని దర్శకుడిగా ఎంపిక చేశారు.
‘పవర్’ సక్సెస్తో ఈయనకు వరుసగా భారీ ఆఫర్లే వచ్చినా కూడా ఈయన పవన్తో సినిమా చేయాలనే కోరికతో వాటికి కాదని, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.బాబీ ఈ సినిమాకు ఎంపిక అయ్యి, అప్పుడే దాదాపు ఆరు నెలలు కావొస్తుంది.
అయినా ఇప్పటి వరకు కూడా ‘గబ్బర్సింగ్`2’ పట్టాలెక్కింది లేదు.దాంతో ఇప్పుడు బాబీ పశ్చాతాప పడుతున్నాడని తెలుస్తోంది.
ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నానో, మరేదైనా సినిమా చేసి ఉంటే ఈపాటికి విడుదలకు సిద్దంగా అయ్యేది అంటూ తనలో తాను బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ‘గబ్బర్సింగ్`2’ సినిమాను ఇప్పట్లో మొదలు పెట్టే ఆలోచనల్లో ఉన్నట్లుగా లేడు.
బాబీ మరి కొంత కాలం ఓపిక పట్టాల్సిందే.