ఇంత దీనంగా అభ్యర్థిస్తున్నది ఎవరు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు.భర్తను భార్య కాదు.
ఒక రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.అది ఢిల్లీ (కేంద్ర పాలిత ప్రాంతం)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం.
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి నరేంద్ర మోదీ సర్కారు నానా తిప్పలు పెడుతోంది.ఒక్క మాటలో చెప్పాలంటే వెంటాడి వేటాడుతోంది.
ఒక రాష్ర్ట ప్రభుత్వాన్ని కేంద్రం ఇంతగనం వేధించడం ఎక్కడా జరిగి ఉండదు.ఒకవిధంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్కు శాంతి లేకుండా చేస్తోంది.అంతంతమాత్రపు అధికారాలున్న కేజ్రీవాల్ విసిగిపోయి ఇదిగో…ఇలా పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేయించారు.‘ప్లీజ్…దిల్లీ సర్కార్కో కామ్ కర్నే దీజియే.దిల్లీ సర్కారు బాగానే పనిచేస్తోంది’…(దయచేసి దిల్లీ ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వండి.దిల్లీ ప్రభుత్వం బాగానే పని చేస్తోంది) ఒక రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని అది కూడా నేరుగా ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి హోర్డింగు బహిరంగంగా ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అయివుండొచ్చు.
జాతీయ మీడియా కేంద్రీకృతమై ఉండే ఢిల్లీలో, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉండే దేశ రాజధాని నగరంలో ఇలాంటి హోర్డింగ్ ఏర్పాటు చేయడమంటే ప్రధాని పరువు తీయడం తప్ప మరోటి కాదు.ప్రధాని నిర్వాకాన్ని ఎండగట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని కేజ్రీవాల్ భావించినట్లుంది.