మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా త్వరలో ‘తని ఒరువన్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లబోతున్న విషయం తెల్సిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ రీమేక్ తెరకెక్కబోతుంది.
ఆ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.జూన్ లేదా జులైలో చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కాని ఈ సినిమా చుట్టూ వివాదం అలుముకుంటుంది.ఈ సినిమాను మైత్రి మూవీస్ మరియు దిల్రాజు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు.
చరణ్ డేట్లను మైత్రి మూవీస్ వారు ఎప్పుడో తీసుకున్నారు.దాంతో చరణ్ ‘తని ఒరువన్’ తర్వాత తన సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్లో చేసేందుకు ఓకే చెప్పాడు.
కాని సుకుమార్ మాత్రం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం తర్వాత దిల్రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు.దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఆ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
కాని ఆ సినిమా ఆగిపోయింది.దాంతో దిల్రాజు నిర్మాణంలో మరో సినిమాను సుకుమార్ చేయాలి.
సుకుమార్ తన తర్వాత సినిమాను చరణ్తో చేస్తున్నాడు కనుక ఆ సినిమాను తానే నిర్మిస్తాను అంటూ దిల్రాజు ముందుకు వస్తున్నాడు.ఈ నేపథ్యంలో చరణ్ మరియు సుకుమార్లు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.