సినిమారంగంలో ఉండే సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పేదేముంది.ఓ సినిమా హిట్ అయితే దానికి వాడిన చాలా విషయాలని రిపీట్ చేయాలి అనుకుంటారు.
అన్ని వర్కవుట్ కావు.ఠాగూర్ బ్లాక్బస్టర్ అయ్యిందని, టైటిల్ చివర్లో “ర్’ వచ్చేలా మూడు అక్షరాల పేర్లతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు నిర్మాత ఠాగూర్ మధు.సందీప్ కిషన్ “టైగర్”, వరుణ్ తేజ్ ” మిస్టర్”, సాయిధరమ్ తేజ్ “విన్నర్” .ఇక బడా బాబు మహేష్ బాబుతో తీసిన “స్పైడర్” అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి
ఒకప్పుడు మహేష్ బాబు కూడా మూడు అక్షరాల టైటిల్స్ కలిసొస్తున్నాయని పదే పదే మూడు అక్షరాల టైటిల్స్ వాడాడు.కాని ప్రతీసారి మురారి, ఒక్కడు, పోకిరి, అతడు లాంటి సినిమాలే రావు కదా, అతిథి, ఖలేజా, ఆగడు, స్పైడర్ లాంటి సినిమాలు కూడా తగులుతుంటాయి.కాబట్టి టైటిల్ సెంటిమెంట్ అనేది పనికిరాదు.
కాని చిత్రంగా ఇలాంటి సెంటిమెంట్ ని అగ్రనిర్మాత దిల్ రాజు కూడా పట్టించుకోవడం విచిత్రం.ఆయన రామ్ హీరోగా నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ, సునీల్ హీరోగా తీసిన కృష్ణాష్టమి చిత్రాలు దారుణంగా విఫలమయ్యాయి.
ఇప్పుడు మహేష్ బాబు 25వ చిత్రానికి “కృష్ణ ముకుంద మురారి” అనే టైటిల్ ని అనుకున్నారు.కాని ఆ టైటిల్ మీద భయం వ్యక్తం చేస్తున్నారట దిల్ రాజు.
కృష్ణుడు తనకి కలిసి రాలేదని ఆయన భావన.కాని టైటిల్ లో ఏముంది? బృందావనం కూడా కృష్ణుడికి సంబంధించిన టైటిలే కదా, మరి ఆ సినిమా సక్సెస్ ని సాధించింది.రామ రామ కృష్ణ కృష్ణలో కృష్ణుడితో పాటు రాముడు కూడా ఉన్నాడు కదా, అలాగే ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్యా కూడా డిజాస్టర్ సినిమానే కదా.దేవుళ్ళ పేర్లు కలిసి రాలేదని అనుకోవడానికి లేదు.కథ కలిసి రావాలి అంతే.కథ బాగుండటం వలనే ఆయన సినిమాలు బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడాయి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించనున్న “మహేష్ 25” వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.