బ్రూస్ లీ మినహాయిస్తే డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది దిల్ రాజుకి.పటాస్, బాహుబలి, రీసెంట్ గా కుమారి 21ఎఫ్ చిత్రాలతో భారి లాభాలు పిండుకున్నారు ఈ అగ్రనిర్మాత.
తాజాగా మరో క్రేజి చిత్రం నైజాం హక్కులను కొనుక్కున్నారని వినికిడి.
సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు చిత్రాన్ని ఇటివలే చూసారంట దిల్ రాజు.
సినిమాలో విషయం ఉండటంతో వెంటనే నైజాం హక్కులను తీసేసుకున్నట్లు సమాచారం.ఎంతకు కొన్నారన్నది ఇంకా బయటకి తెలియరాలేదు.
దిల్ రాజుకి చిత్రం నచ్చటంతో యూనిట్ సభ్యులకి సినిమాపై నమ్మకం ఇంకా పెరిగేసింది.
సుధీర్ సరసన వామికా గబ్బి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ మిత్రులు విజయ్ శశి చిత్రాన్ని నిర్మించగా, సన్ని ఎమ్ ఆర్ స్వరాలు సమకూర్చాడు.ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.