టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి తాజాగా డెలివరీ అయ్యింది.పండంటి ఆడ పాపకు జన్మను ఇచ్చింది.
పాప పుట్టిందనే ఆనందంతో ఏ తండ్రి అయినా వెంటనే ఎగిరి గంతేసి పాప దగ్గర వాలి పోతాడు.కాని ధోని మాత్రం అలా కాదు.
ప్రస్తుతం ప్రపంచ కప్ సిరీస్కు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధోని సిరీస్ పూర్తి అయిన తర్వాతే పాపను చూస్తానని అంటున్నాడు.సిరీస్ పూర్తి అవ్వడానికి మరో నెలన్నర రోజులు ఉంది.
అప్పటి వరకు కూడా ధోని తన కూతురును చూసేందుకు వెళ్లడం లేదు.
ముందు ఆట, ఆ తర్వాతే పాప అన్నట్లుగా ధోని వ్యవహరిస్తున్న తీరు దేశం మొత్తం కెప్టెన్ను అభినందించేలా ఉంది.
ఇదే ఉత్సాహంతో మరో సారి ధోని భారత జట్టును విశ్వ విజేతగా నిలపాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.గత ప్రపంచ కప్ సిరీస్లో అద్బుత ఆట తీరును కనబర్చిన ధోని ఈసారి కూడా మరింత పట్టుదలతో ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం అందరి దృష్టి కూడా ధోని కెప్టెన్సీ అదృష్టంపైనే ఉంది.ధోని ప్రపంచ కప్తో వచ్చి కూతురును చూస్తాడేమో చూడాలి.