తమిళ హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ, అజిత్లు తమ సినిమాలను ఒకే సమయంలో తమిళం మరియు తెలుగులో విడుదల చేస్తూ ఉంటారు.వీరికి తమిళ నాట ఎంత క్రేజ్ ఉందో, తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది.
వీరి డబ్బింగ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి.అందుకే భారీ ఎత్తున ప్రచారం చేయడంతో పాటు, తెలుగులో అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తారు.
తాజాగా తమిళంకు చెందిన మరో స్టార్ హీరో ధనుష్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నాడు.
ధనుష్ గత చిత్రం ‘వేలై ఇళ్ల పట్టాదారి’ సినిమా తెలుగులో ‘రఘువరన్ బిటెక్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
ఈ సినిమా కొత్త సంవత్సరం రోజు విడుదలై ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది.ఇప్పటి వరకు తెలుగులో మార్కెట్ లేని ధనుష్ ఈ చిత్రంతో మార్కెట్ను ఏర్పర్చుకున్నాడు.
ఈ సినిమా తర్వాత ధనుష్ నటిస్తోన్న మరో సినిమా ‘అనేగన్’ చిత్రం తెలుగులో ‘అనేకుడు’ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు తమిళ నాట భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తెలుగులో మాత్రం ప్రస్తుతానికి ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు.ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే ఇక ధనుష్ను తెలుగు హీరోగా తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తారు.
మరి ధనుష్ ఆ పేరు తెచ్చుకుంటాడా చూడాలి.