మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కడెక్కడి ట్యూన్స్ ఎత్తుకు వస్తాడని, ఆయన చేసే ట్యూన్స్లలో ఎక్కువ శాతం కాపీ కొట్టినవే అనే టాక్ ఇండస్ట్రీతో పాటు బయట కూడా ఉంది.చిన్న చిత్రాలకే కాకుండా పెద్ద సినిమాలకు కూడా తమన్ ట్యూన్స్ కాపీ కొడుతూనే ఉంటాడు.
అదృష్టం కలిసి వచ్చి అలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ దూసుకు పోతున్నాడు.ఈయన అన్ని పాటలు దాదాపుగా ఒకేలాగ ఉంటాయని విమర్శలు కూడా ఉన్నాయి.
ఇన్ని విమర్శల మధ్య తాజాగా మరో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాపీ గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్గా తమన్ను ఇరుకున పెట్టేలా మాట్లాడాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘కుమారి 21ఎఫ్’ సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుని దూసుకు పోతుంది.
ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… నా కెరీర్లో నేను ఇప్పటి వరకు ఒక్క ట్యూన్ను కూడా తెలిసి కాపీ కొట్టలేదు.ఒక యాక్షన్ సినిమా కోసం ఒక దర్శకుడు ఒక వెస్ట్రన్ ట్యూన్ను కాపీ కొట్టమని అడిగినా కూడా నేను సున్నితంగా తిరస్కరించాను అని అన్నాడు.
సంగీతం నేర్చుకున్నప్పుడు వేరే ట్యూన్స్ కాపీ కొడితే ప్రయోజనం ఏంటని, అయినా ఒకరి ట్యూన్స్ కాపీ కొట్టడం పెద్ద నేరం అని ఈయన చెప్పుకొచ్చాడు.దేవిశ్రీ కామెంట్స్ ఇండైరెక్ట్గా తమన్కు తగలటం ఖాయం అని కొందరు అంటున్నారు.
ప్రస్తుతం దేవిశ్రీ ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.