వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవకట్టా ప్రస్తుతం మంచు విష్ణుతో ‘డైనమైట్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.తమిళంలో సక్సెస్ అయిన ‘అరిమ నంబి’ సినిమాకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
యాక్షన్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్గా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.ప్రణీత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా ఫస్ట్లుక్ తాజాగా విడుదలైంది.
ఈ సినిమా మోషన్ పోస్టర్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఆ మోషన్ పోస్టర్లో మంచు విష్ణు పలికిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి తీసుకు వెళ్తున్నాయి.గతంలో ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్తో సినిమాపై అంచనాలను పెంచిన దేవ కట్టా ఈ సినిమాలో కూడా తనదైన మార్క్ మాస్ డైలాగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
‘‘పోలీస్ దళాలు, సీఆర్పీఎఫ్ బెటాలియన్స్ కాకుండా హైదరాబాద్లోని మొత్తం రౌడీ షీటర్లు అందరు ఒకే ఒక్క వ్యక్తిని వెంటాడుతున్నారు… వారందరికి అర్థం కాని విషయం ఏంటంటే… వెంటాడుతున్నది వాళ్లు కాదు.వాడు అని… పారిపోవాల్సింది వాడు కాదు… వాళ్లు అని… ’’