ఓ నెల క్రితం ఓ పురుషుడు అత్యాచారం చేయబోతోంటే అతడి పురుషాంగంపై రాయితో దాడి చేసింది ఓ అమ్మాయి.అది ఆత్మరక్షణ.
ఈమధ్య ఓ దొంగబాబా ఇలాంటి పనే చేయబోతే ఓ అమ్మాయి కత్తితో పురుషాంగం మీద దాడి చేసి కోసేసింది.ఇది కూడా ఆత్మరక్షణ.
గత ఏడాది భర్త శృంగారంలో పాల్గొనట్లేదని ఓ భార్య పురుషాంగం కోసేసి జైల్లో పడింది.ఎందుకంటే ఇక్కడ ఆత్మరక్షణ కోసం చేసిన పని కాదు.
హింస.ఇక తాజాగా ఢిల్లీలో ఇలాంటి సంఘటనే జరిగింది.
కారణం ఏమిటంటే, అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోలేదు.మామూలుగా అయితే ప్రేమించలేదనో, పెళ్ళికి ఒప్పుకోలేదనో ఆసిడ్ దాడులు చేయడం గురించి విన్నాం కదా, ఇక్కడ అబ్బాయి కాబట్టి ఆసిడ్ దాడికి బదులు ఈ పని చేసింది ఓ అమ్మాయి.
ఢిల్లీలోని మొంగోలాపురికి చెందిన ఓ 35 ఏళ్ళ అబ్బాయి (పేరు బయటపెట్టలేదు) ఓ 25 ఏళ్ళ అమ్మాయి (పేరు బయటపెట్టలేదు) గత రెండేళ్ళుగా ప్రేమలో ఉన్నారట.ఇద్దరిలో తప్పు ఎవరిదో కాని గత కొంతకాలంగా వారి బంధం బలహీనపడింది.
పెళ్ళి చేసుకుందాం అని అమ్మాయి, పెళ్ళి వద్దు బంధం కట్ అని అబ్బాయి, ఈ తంతు కొన్నిరోజులుగా కొనసాగుతోంది.
చివరకి బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి వదిన దగ్గరినుంచి ఈ అబ్బాయికి ఫోన్ వచ్చింది.తన మరదలి పెళ్ళి గురించి మాట్లాడాలి, ఇంటికి రావాలి అంటూ అడిగింది.అబ్బాయి వారి ఇంటికి వెళ్ళాడు.ఇంట్లో ఆ అమ్మాయి, తన అన్నయ్య, కాల్ చేసిన వదిన ఉన్నారు.అమ్మాయి – అబ్బాయి మధ్య చర్చలు మొదలై పెద్ద గొడవ దాకా వెళ్ళింది.
దాంతో అతడిని బాత్ రూమ్ లోకి తోసి బట్టలు విప్పేసింది అమ్మాయి.పెళ్ళి చేసుకోవాలంటూ గట్టిగా అడిగింది.
తను అప్పటికీ కాదన్నాడు.
మరి క్షణికావేశమో లేక ముందే ప్లాన్ చేసిందో, వెంటనే ఓ కత్తి తీసుకొచ్చి పొడవడమే కాకుండా పురుషాంగం, వృషణాల మీద అదే కత్తితో దాడి చేసింది.
చిత్రమైన విషయం ఏమిటంటే ఇదంతా చూస్తున్న ఆమె అన్న, వదన ఆపడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదట.గాయాలతో ఉన్న అతడిని అక్కడే పడేసి ముగ్గురు పారిపోయారు.
ఈ అబ్బాయి అతికష్టం మీద రొడ్డు మీదకి వచ్చాడు.రోడ్డు మీద వెళ్ళేవారే అతడిని సంజీవ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ చేర్చారట.
ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
అమ్మాయి ఆయుధంతో దాడి చేసిందన్న నెపంతో సెక్షన్ 326 మీద కేసు బుక్ చేసారు.
పారిపోయిన ఆ ముగ్గురి జాడ కోసం వెతుకుతున్నారు పోలీసులు.