యంగ్టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ల మూవీ షూటింగ్ ప్రారంభం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.రెండు మూడు నెలల క్రితం ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా ప్రారంభం అయ్యింది లేదు.
అయితే తాజాగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను జూన్ చివరి వారంలో ప్రారంభిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.ఈసారి తప్పకుండా ప్రారంభం అవుతుందని ఎన్టీఆర్ కూడా చెప్పాడు.
అయితే మరోసారి ఈ సినిమా అనుకున్న సమయంకు ప్రారంభించలేక పోతున్నారు.తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం ఈ సినిమాను జులైలో ప్రారంభించబోతున్నారు.
కథానుసారం ఈ సినిమాలో ఎక్కువ షూటింగ్ను లండన్లో చిత్రీకరించనున్నారు.దాంతో ఈనెల 28 లేదా 29న చిత్ర యూనిట్ సభ్యులు లండన్కు బయలుదేరనున్నారు.
జులై మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సుకుమార్, లొకేషన్స్ను కూడా ఎంపిక చేశాడు.దాంతో చకచక మొదటి వారంలో సినిమాను ప్రారంభించనున్నారు.45 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపనున్నారు.ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఎంపిక అయ్యింది.రాజేంద్ర ప్రసాద్ మరియు జగపతిబాబులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.‘నాన్నకు ప్రేమతో.’ అనే టైటిల్ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.