పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తాను ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఆ మధ్య దాసరి నారాయణరావు ఒక ప్రకటన చేశారు.ఆ తరువాత ఆ సినిమాకి స్క్రిప్టు వర్క్ జరుగుతోందనీ .
ఫలానా దర్శకుడు తెరకెక్కించనున్నాడనే వార్తలు షికారు చేశాయి.ఇక కొన్ని రోజులుగా ఎలాంటి సమాచారం లేదు.
దాంతో ఈ సినిమా లేదేమోనని అనుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమాను గురించి దాసరి మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తో తాను నిర్మించబోయే సినిమాకి స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్పారు.ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని అన్నారు.
దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పారు.ప్రస్తుతం పవన్ చేస్తోన్న ఎస్.జె.సూర్య సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.నిజానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు భావించారు.దాసరితో పవన్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్టును అందిస్తుండటం వలన, అభిమానుల కోరిక ఇలా నెరవేరనుందన్న మాట.