చిరంజీవి 150 వ సినిమా కత్తి రీమేక్ అని రాం చరణ్ తేజ ప్రకటించిన క్షణం నుంచీ అన్నీ గొడవలూ గోల లే సాగుతూ వస్తున్నాయి.పూరీ జగన్నాథ్ తో 150 అనుకోవడం – ఆటో జానీ అనే స్టొరీ ని చిరంజీవి రిజెక్ట్ చెయ్యడం తెలిసిన విషయమే.
రాం చరణ్ తరవాత స్వయంగా కత్తి రీమేక్ గురించి ప్రకటన చేసిన తరవాత మెగా ఫాన్స్ ఈ సినిమా కోసం కొండంత ఆశతో ఉన్నారు.కానీ ఈ సినిమా కథ చుట్టూ తీవ్ర వివాదాలు చుట్టు ముడుతూ ఉన్నాయి.
దాసరి – చిరంజీవి ల మధ్యన చిలికి చిలికి గాలివాన గా మారుతోంది ఈ గొడవ.ఈ విషయం గురించి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ చిరంజీవి ఈ కత్తి సినిమా మీద మంచి క్లారిటీ తో ఉన్నారు అనీ రచయిత కి అన్యాయం చేసే ఉద్దేశ్యం అసలు చిరు కి లేదు అన్నారు.
ఈ వివాదం ముగిసిన తర్వాతే సినిమా మొదలుపెడదాం అని చరణ్ కు చెప్పారట.దీంతో విజయ్, మురగదాస్ లు కత్తి కథ నాదే అంటున్న నరసింహారావు కి ముప్ఫై లక్షలు ఇచ్చే ఉద్దేశ్యంతో ఉన్నారట.
కానీ నరసింహారావు మాత్రం యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారట.ఈ డిమాండ్ వెనుక దాసరి హస్తం ఉందని ఫిల్మ్ నగర్ గుసగుసలు.
ఆయనే వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని అంటున్నారు మరి.