సినిమా రంగంలో సినిమాని విడుదల చేసే విషయంలో సెంటిమెంట్ పాలు ఎక్కువగానే ఉంటుంది.సాధారణంగా ఎవరు సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఎదురు వెళ్ళటానికి సాహసం చేయరు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయటానికే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు.అసలు విషయంలోకి వస్తే…ప్రస్తుతం చరణ్ గీతాఆర్ట్స్ బ్యానర్ లో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘దృవ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసారు.
అల్లు అరవింద్ బేనర్ లో మగధీర తర్వాత చరణ్ చేస్తున్న సినిమా ఇది.గత రెండు సంవత్సరాల నుంచి దసరా బరిలో దిగి అభిమానులను నిరాశ పరిచాడు.ప్లాప్స్ లో ఉన్న చరణ్ మేనమామ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.‘దృవ’ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు.ఈ సినిమా విజయంపై మంచి ధీమాగా ఉన్నాడు.
అయితే మేనమామ బేనర్ లో వచ్చిన మగధీర లా హిట్ కొట్టి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో…సెంటిమెంట్ కి పడిపోతాడో వేచి చూడాలి.