సీపీఎం పార్టీ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంబించింది.అందులో భాగంగానే మీడియాలో ఎక్కువగా కనిపిస్తేనే ప్రజలు వారిని మరచిపోకుండా ఉంటారు అని భావించింది.
అదే క్రమంలో తమకు కార్పొరేట్ మీడియా సహకరించడం లేదని ఆరోపిస్తూ…గా మీడియా శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.త్వరలో తెలుగులో మరో 24 గంటల వార్తా ఛానల్ ను ప్రారంభించనున్నట్టుగా సీపీఎం నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ చెరో వార్తా ఛానల్ ఉన్నాయి.కొంతకాలం కిందట ఈ రెండు పార్టీలూ ఛానళ్లను ప్రారంభించుకొన్నాయి.
అయితే ఇప్పుడు మరో ఛానల్ రానున్నదట.ఇది ఆంధ్రకు ప్రత్యేకమైనదని సీపీఎం ప్రకటించింది.
ప్రస్తుతం తమ పార్టీకి ఉన్న ఛానల్ ను తెలంగాణపై ఫోకస్ పెట్టేలా చూసి.రెండో ఛానల్ ను ఆంధ్ర కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగా సీపీఎం ప్రకటించింది.
ఇక బెంగాల్ , కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలకు సొంతంగా టీవీ ఛానళ్లున్నాయి.మరి ఏపీ, తెలంగాణల్లో కూడా ఆ ముచ్చ తీర్చుకొంటున్నారు.
వీటి వల్ల ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో చూడాలి.ఏది ఏమైనా తాము ఇంకా ఉన్నాం అని చూపించడానికే తప్పా.
ఏ ఛానెళ్ల వల్ల ఆ పార్టీలకు ఒరిగేది ఏమీ ఉండదు అంటున్నాయి రాజకీయ వర్గాలు.