న్యాయస్థానాలు తొందరపడి దోషులకు మరణ శిక్ష వేయొద్దని, వారు న్యాయపరమైన పరిష్కారాలు వెదుక్కునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.మరణ శిక్షను ధ్రువీకరించినా దోషులకు జీవించే హక్కు ఉంటుందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని ఒక సెషన్స్ కోర్టు ఒక యువతికి, ఆమె ప్రియుడికి మరణశిక్ష విధించింది.వీరు చేసిన నేరమేమిటంటే…రెండువేల ఎనిమిదో సంవత్సరంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేశారు.
హతుల్లో పది నెలల పసిపాప కూడా ఉంది.ఇది తీవ్రమైన నేరం కాబట్టి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.
అయితే దీన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది.ఇది తొందరపడి ఇచ్చిన తీర్పుగా అభిప్రాయపడింది.
సెషన్్స జడ్జి తీర్పు ఇచ్చిన తరువాత శిక్ష అమలుకు కేవలం ఆరు రోజులే సమయం ఇచ్చారని, దోషులు పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు ౩౦ రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం పేర్కొంది.చాలా కోర్టులు తొందరపడి మరణశిక్షలు విధిస్తున్నాయని సుప్రీం అభిప్రాయపడింది.
నిజమే కోర్టులు తీర్పులు ఇవ్వడంలో తొందరపడకూడదు.కాని కేసులను దశాబ్దాలుగా సాగదీయడం కూడా సమంజసం కాదు.