తప్పును సరిదిద్దుకోవడానికో.లేక సీమాంధ్రకు న్యాయం చేయడానికో తెలీదు కానీ…మొత్తానికి కొంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంబించింది.
ఇదిలా ఉంటే…మరో పక్క ఈ కోటి సంతకాల కోసం కొంగ్రెస్ పార్టీ చేయని పని లేదు.అయితే ఏం చేసైనా సరే.మళ్లీ సీమాంధ్రలో తాము జావసత్వాలను తిరిగి తెచ్చుకోవాలని…బీజేపీని టార్గెట్ చేస్తూ…సీమాంధ్రకు ప్రత్యేక హోదా తెప్పించాలని కొంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది…ఇక ఈ ప్రయత్నంలో బాగంగా ఎటువంటి అవకాశాన్ని ఒదులు కోవడానికి ఆ పార్టీ సిద్దంగా లేదు.అందుకే కేవలం సీమాంధ్రలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఈ కోటి సంతకాల ప్రోగ్రామ్ ని చేపట్టనుంది…అదేంటి హైదరాబాద్ తెలంగాణా కిందకు వస్తుంది కదా అంటే.
కొంగ్రెస్ చెప్పే మాట.హైదరాబాద్ లో ఎక్కువశాతం తెలుగువారు ఉన్నారు అని, వారి ఆకాంక్ష కూడా ఇదే అని చెబుతూ ముందుకు పోతుంది.అయితే మరో పక్క కోటి మంది దొరకక పోవడం వల్లనే హైదరాబాద్ ప్రజలను ఆశ్రయించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎంతకాదనుకున్నా అదీ నిజమేలే.