దేశంలోని ప్రముఖ ప్రాంతాలకు, రహదారులకు గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మీ అబ్బ సొత్తా’ అని వ్యాఖ్యానించిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ వైఖరిని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు వెరైటీగా పగ తీర్చుకున్నారు.
యూపీలోని అలహాబాద్ లో నిర్మించిన ఓ ప్రజా మరుగుదొడ్డికి రిషికపూర్ పేరును పెట్టారు.
ఇక్కడి శివాజీ పార్క్ ఏరియాలో నిర్మించిన సులభ్ టాయిలెట్ కు ఆయన పేరు పెట్టారని ‘ప్రదేశ్ 18’ ఓ కథనాన్ని ప్రచురించింది.గతవారంలో రిషి కపూర్ గాంధీ కుటుంబ సభ్యులను ఎటాక్ చేస్తూ, “కాంగ్రెస్ పెట్టిన పేర్లన్నీ తొలగించాలి.
బాంద్రా – వర్లీ సీ లింక్ కు లతా మంగేష్కర్ లేదా టాటా పేరు పెట్టాలి” అని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.చండీగఢ్ లో రాజీవ్ గాంధీ పేరిట ఆస్తులకు పేర్లు ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ తాజా ఘటనపై రిషికపూర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.