తెంగాణా రాష్ట్ర రోడ్లు భవనా శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్పీ పదవికి రాజీనామా చేసారు.ఈ మేరకు సోమవారం మండలి చైర్మన్ స్వామి గౌడ్ను కల్సి తన రాజీ నామా లేఖను అందజేసారు.
దానిని ఆమోదిస్తున్నట్లు స్వామిగౌడ్ ప్రకటించారు.ఇటీవల జరిగిన పాలేరు నియోజక వర్గ ఉప ఎన్నికల్లో మం్రతి తుమ్మల అధికార పార్టీ అభ్యర్ధిగా భారీ మెజార్టితో గెలుపొందిన విషయం విదితమే.
కాగా తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.ఇటీవల ఎన్నిక సందర్భంగా పార్టీలో చేసిన ఓ కాంగ్రెస్ నేత ఈ పదవిపై స్పస్టమైన హామీ పొందినట్లు చెప్తున్నా….
ప్రస్తుతం ఆ పరిస్ధితి కనిపించకపోవటంతో ఆందోళన చెందుతున్నట్లు వినవస్తోంది.