‘కలర్స్’ కార్యక్రమంతో ఎప్పుడో ప్రేక్షకులకు పరిచయం అయిన స్వాతి హీరోయిన్గా కూడా మెప్పిస్తోంది.ఈమె ప్రస్తుతం హీరోయిన్గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.
తెలుగులోనే కాకుండా తమిళం మరియు మలయాళంలో ఈ అమ్మడు హీరోయిన్గా దూసుకు పోతుంది.కాగా ఈమె తాజాగా ట్విట్టర్లో ఒక ఫొటోను ట్వీట్ చేసింది.
ఆ ఫొటోలో స్వాతి కాస్త ఏజ్డ్గా కనిపిస్తోంది.దాంతో స్వాతి అభిమాని ఒకతను.
ప్లీజ్ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయకండి, ఆంటీలా కనిపిస్తున్నారు అంటూ రీ ట్వీట్ చేశాడు.అందుకు స్వాతి ఆ అభిమాని దిమ్మతిరిగి పోయేలా షాకిచ్చింది.
స్వాతి అభిమాని ట్వీట్కు స్పందిస్తూ.తాను అప్పటి కలర్స్ స్వాతిని కాదు, అప్పుడు 16 సంవత్సరాలు ఉండేవి.
ఎప్పుడు అలాగే ఉండాలంటే ఎలా, ఆంటీ అంటే తపేం లేదు.ఇప్పటిని తాను టీనేజర్ను అనే ఫీలింగ్ నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఈ ట్వీట్కు సదరు అభిమాని దిమ్మదిరిగి పోయింటుందని కొందరు అంటున్నారు.పెళ్లి చేసుకోకుండానే ఆంటీని అని ఒప్పుకున్న స్వాతి ఘట్స్కు సినీ వర్గాల వారు హ్యాట్సాప్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఈమె ‘త్రిపుర’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది.అటు తమిళం మరియు మలయాళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది.