టాలీవుడ్లో ఎప్పుడు కూడా హీరోల మధ్య, హీరోయిన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది.హీరోల్లో నెం.1 ఎవరు అనే విషయంలో వార్ జరుగుతూ ఉండగా, హీరోయిన్స్లో ఎవరు క్రేజీ హీరోయిన్ అనే విషయంలో వార్ జరుగుతూ ఉంటుంది.ఇక ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ తమన్నా మరియు జూనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ల మధ్య ఠఫ్ ఫైట్ జరుగుతోంది.
వీరిద్దరు కూడా క్రేజ్ విషయంలో పోటీ పడుతున్నారు.రకుల్కు సమంతకు మధ్య ఫైట్ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సమంత ఈ ఫైట్ నుండి తప్పుకుని తమన్నా వచ్చింది.
తెలుగులో ప్రస్తుతం సమంతకు పెద్దగా సినిమాలు లేవు.దాంతో ఆమె ఈ ఫైట్లో నిలువలేక పోయింది.ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది.మరో వైపు తమన్నా కూడా ‘బాహుబలి’తో పాటు రవితేజ ‘బెంగాళ్ టైగర్’ సినిమాల్లో హీరోయిన్గా నటించి తన సత్తా చాటేందుకు సిద్దంగా ఉంది.
ఈమె మరో రెండు సినిమాల్లో కూడా నటించబోతుంది.దాంతో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లలో ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అన్నది త్వరలో తేలిపోనుంది.
ప్రస్తుతం రకుల్ నటిస్తున్న ఏవైనా రెండు స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయితే ఈమెకు తిరుగు లేనట్లే.అదే రకుల్ ఫ్లాప్ అయ్యి, ‘బాహుబలి’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలు సూపర్ హిట్ అయితే తమన్నా క్రేజీ హీరోయిన్గా మారిపోతుంది.