తెలంగాణ పాలిటిక్స్లో షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.టీడీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు.
కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్కి సైకిల్ దిగి కారెక్కేయడం తెలిసిందే.దీంతో టీ టీడీపీ ఓ సీనియర్ నేతను కోల్పోయినట్టు అయింది.
అంతేకాదు, అప్పట్లో టీడీపీని టీఆర్ ఎస్లో విలీనం చేసేందుకు కూడా ఎర్రబెల్లి తనవంతు పాత్ర పోషించారు.ఇక, అప్పట్లో ఆయన పార్టీని వీడడం వెనుక పెద్ద కారణాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.
ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నతాను మంత్రి కావాలని ఎర్రబెల్లి అనుకున్నారు.దానినే జీవితాశయంగా కూడా పెట్టుకున్నారు.
అయితే, రానురాను కారు స్పీడుకి తెలంగాణలో టీడీపీ సైకిల్ వెనకనే ఉండిపోవాల్సి వచ్చింది.దీంతో తన కోరిక, కల నెరవేరదని భావించారో ఏమో ఎర్రబెల్లి ఓ ఫైన్డే తన మందీ మార్చలంతో కేసీఆర్ సమక్షంలో కారెక్కేశారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాపై గెలిచిన దయన్నకి మంచి ఫాలోయింగే ఉంది.అయితే, తన కోరికను నెరవేర్చుకునేందుకే ఆయన అప్పట్లో కేసీఆర్ పంచన చేరారు.
అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ఓడ ఎక్కే వరకే ఓడ మల్లన్న.
ఓడ మల్లన్న అని కూనిరాగాలు తీసిన కేసీఆర్ ఇప్పుడు దయన్నని అసలు పట్టించుకోవడమే మానేశారట.
కనీసం ముఖం చూడాలంటే కూడా అవకాశం కల్పించడం లేదట.
పోనీ తనకు మంత్రి పదవిని అటుంచితే.వచ్చే ఎన్నికల్లో తన అల్లుడికి జహీరాబాద్ ఎంపీ సీటు ఇచ్చేలా మచ్చిక చేసుకుందామని ప్రయత్నించినా లాభం కనిపించడం లేదట.
దీంతో దయన్న జెండా మార్చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే ఓ కేసు విషయమై కోర్టుకి వచ్చిన ఎర్రబెల్లి టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.
రమణతో కలిసి ఆదిలాబాద్లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్రాథోడ్ని కూడా కలిసి వచ్చారట.
అంతేకాకుండా టీ టీడీపీ నేతలతో ఎర్రబెల్లి పండగ చేసుకోవడం పైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏదైతేనేం ఇదే సరైన మూవ్మెంట్ అని భావించిన టీడీపీ నేతలు ఎర్రబెల్లిని తిరిగి పార్టీలోకి పిలిచేందుకు, రెడ్ కార్పెట్ పరిచేందుకు రెడీ అవుతున్నారట! ఎర్రబెల్లి పార్టీ మారినా మారకపోయినా ఆయన మంత్రి అవ్వాలనే కోరిక మాత్రం ఇప్పట్లో నెరవేరేలా లేదన్న టాక్ ఏపీ పాలిటిక్స్లో వినిపిస్తోంది.
మరి ఎర్రబెల్లి కూడా మనసు చంపుకునే టీఆర్ఎస్లో కొనసాగుతున్నారట.ఫ్యూచర్లో ఆయన పొలిటికల్ ప్లాన్లు ఎలా ఉంటాయో చూడాలి.