2019 ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడే వేగం పెంచారు.తెలంగాణలో ఇప్పటికే భారీ ఎత్తున వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు ఉండవని క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ అటు పార్టీ పరంగాను, ప్రభుత్వ పరంగాను అందరిని ఉరుకులు పరుగులు పెట్టించేస్తున్నారు.తెలంగాణలో ఎక్కడైనా ఎన్నికలు జరగడమే ఆలస్యం టీఆర్ఎస్దే గెలుపు అవుతోంది.
ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉంది.అందుకోసం ఇప్పుడే కేబినెట్లో భారీ ప్రక్షాళనకు రెడీ అవుతోన్నట్టు తెలుస్తోంది.
పనితీరు సరిగా లేని, తన తాజా సర్వేల్లో లీస్ట్ ర్యాంకుల్లో ఉన్న మంత్రులను కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా తప్పిస్తారని తెలుస్తోంది.మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, మహేందర్ రెడ్డిపై వేటేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.
అస్సలు అనుభవం లేకపోయినా బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తే జోగు రామన్న దారుణంగా ఫెయిల్ అయ్యారని కేసీఆర్ భావిస్తున్నారు.ఇక బీఎస్పీ నుంచి వచ్చిన ఇంద్రకరణ్రెడ్డి తీవ్ర ఆరోపణల్లో చిక్కుకుంటున్నారు.
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వయో భారంతో రాణించలేకపోతున్నారు.మహేందర్రెడ్డి దూకుడు వ్యవహారంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నారన్న నివేదిక కేసీఆర్ వద్ద ఉంది.
ఇక చందూలాల్కు శాఖలోనే అస్సలు పట్టులేదట.
ఇక కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో నిరంజన్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, స్వామి గౌడ్, లేడీ కోటాలో కొండా సురేఖ, కోవా లక్ష్మి ఉన్నారు.
ఏదేమైనా తెలంగాణలో కేబినెట్ ప్రక్షాళన ఓ భారీ కుదుపు కుదపనుందని వార్తలు వస్తున్నాయి.మరి కేసీఆర్ ఎవరికి షాక్ ఇస్తారో ? ఎవరికి స్వీట్ పెడతారో చూడాలి.