ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ టైంలోనే మంత్రి పదవి దక్కించుకున్నారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు.మంత్రిగా పనిచేసిన ఈ మూడేళ్లలో రావెల ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయ్యారు.
వరుస వివాదాలతో రావెలతో పాటు ఆయన ఇద్దరు కుమారులు సైతం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మచ్చలు తెచ్చారు.చివరకు చంద్రబాబు వార్నింగ్లతో సైతం రావెల తీరు మారకపోవడంతో రావెలను చంద్రబాబు ప్రక్షాళనలో మంత్రి పదవి నుంచి తప్పించేశారు.
ఇదిలా ఉంటే మంత్రి పదవి పోయిన తర్వాత కూడా రావెల బాబుకు, ప్రభుత్వానికి యాంటీగా వ్యవహరిస్తున్నారన్న నివేదికలు ఇప్పటికే చంద్రబాబుకు పదే పదే వెళ్లాయి.చంద్రబాబు బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవడం, వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకులతో తరచూ టచ్లో ఉండడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాబు నిఘా రావెలపై కంటిన్యూ అవుతూనే ఉంది.తాజాగా మరోసారి బాబుకు ఆయన అడ్డంగా దొరికేశారని తెలుస్తోంది.
మంత్రి పదవి పోయిన తర్వాత రావెల ఎక్కువగా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.ఇటీవల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబును టార్గెట్గా చేసుకుని పదే పదే విమర్శలు చేస్తున్నారు.
మాదిగ రిజర్వేషన్ కు మద్దతివ్వాలని కోరుతూ గుంటూరులో కురుక్షేత్ర మహాసభ పేరిట కృష్ణ మాదిగ రచ్చరచ్చ చేశారు.ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి.
కురుక్షేత్ర మహాసభకు గుంటూరు వచ్చిన మందకృష్ణ మాదిగకు తన ఇంట్లోనే రావెల షెల్టర్ ఇచ్చారని చంద్రబాబుకు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయి.ఇక మందకృష్ణ రచ్చపై చంద్రబాబు వెంటనే మాదిగ, మాలల వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బాబు ఈ విషయంపై నిలదీయడంతో నీళ్లు నమిలిన రావెల డొనేషన్ల కోసమే ఆయన తన ఇంటికి వచ్చారని వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు.
రావెలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన చంద్రబాబు తనకు అంతా తెలుసు…తనను బుకాయించే ప్రయత్నం చేయవద్దని రావెలపై మండిపడినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో రావెల కథ కంచికిచేరిపోయినట్టే అన్న టాక్ గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా రాదని టీడీపీ నాయకులే చెప్పేస్తున్నారు.