కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కెరీర్ మొదటి నుండి కూడా ఏదో ఒక వివాదంతో సాహవాసం చేస్తూనే ఉంది.తాజాగా ఈ అమ్మడిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
తమిళ నిర్మాణ సంస్థ అయిన పిక్చర్ హౌస్ ఈమెపై కేసును పెట్టింది.తమ నిర్మాణ సంస్థ నిర్మించే సంస్థలో నటించేందుకు ఓకే చెప్పి, డేట్లు కూడా ఇచ్చి, ఇప్పుడు వీలు పడటం లేదని అంటోందంటూ ఈమెపై ఏకంగా క్రిమినల్ కేసునే బుక్ చేయడం జరిగింది.
ఈ పరిణామాలతో షాక్ తిన్న శృతి హాసన్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
కేసు వివరాల్లోకి వెళ్తే… నాగార్జున, కార్తీలు హీరోలుగా పిక్చర్ హౌస్ సంస్థ తెలుగు మరియు తమిళంలో ఒక సినిమాను నిర్మిస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతిహాసన్ను నటించేందుకు రమ్మని పిలువగా ప్రస్తుతం తాను వేరే సినిమాలో బిజీగా ఉన్నానని, కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పిందట.దాంతో నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టులో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
శృతిహాసన్ డేట్లు ఇవ్వక పోవడం వల్ల వేరే నటీనటుల కాల్షీట్లు తీసుకున్న తమకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని శృతి భరించాల్సిందిగా సదరు నిర్మాణ సంస్థ డిమాండ్ చేస్తోంది.మరి ఈ ఫిర్యాదుపై శృతిహాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.