మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు ఎన్నో ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి వెండితెరపై పోటీ పడుతున్నారు.ఈ ఏడాది సంక్రాంతి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపై ఈ ఇద్దరు అగ్ర హీరోల ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి.
వీరిద్దరి మధ్య పోటీ ఇక్కడితోనే కాదు వీరి నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఉన్నట్టు టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్.
మెగాస్టార్ తన రీ ఎంట్రీ మూవీ కోసం ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీని తెరకెక్కించాడు.
ఈ టైటిల్తో స్టోరీ లైన్ రెడీ చేయాలని పరుచూరి సోదరులను కోరాడట.పరుచూరి సోదరులు మంచి స్క్రిఫ్ట్ రెడీ చేశారు కూడా.
అయితే కీలక సినిమా కోసం కొత్త కథ.అది హిస్టారికల్ స్టోరీతో రిస్క్ చేయడం ఎందుకనుకున్న చిరు చివరకు కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమా రీమేక్కు ఓటేశాడు.
మరోవైపు బాలయ్య హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీతో తన 100వ సినిమా పూర్తి చేశాడు.ఇక ఇప్పుడు అటు చిరు తన 151వ సినిమా కోసం ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటుంటే….
ఇటు బాలయ్య సైతం తన 101వ సినిమాను అదే స్టోరీతో చేయాలని డిసైడ్ అయ్యి పరుచూరి సోదరులతో చర్చించాడట.ఈ విషయం చిరుకు తెలియడంతో తాను ఎంతో ఇష్టపడి రాయించుకున్న కథను బాలయ్యకు ఇవ్వవద్దని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడట.
ఇక ఇప్పుడు అటు చిరు , ఇటు బాలయ్య మధ్యలో పరుచూరి సోదరులు నలిగిపోతున్నారట.మరి ఒకే కథకోసం పోటీపడుతున్న ఈ టాలీవుడ్ అగ్రహీరోల్లో ఎవరు ఫైనల్గా ఈ కథను సొంతం చేసుకుంటారో…చిరు వర్సెస్ బాలయ్య మధ్య ఈ కొత్త ఫైట్ ఎంత వరకు వెళుతుందో చూడాలి.