మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి తన 150వ సినిమాను తనయుడు చరణ్ సినిమాతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘బ్రూస్లీ’ సినిమాలో చిరంజీవి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాను వాయిదా వేసి ఫ్యాన్స్ను నిరాశ పర్చేలా ఈ చిత్ర యూనిట్ సభ్యులున్నారు.ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయంకు పూర్తి అయ్యే అవకాశాలు లేవు.దాంతోనే ఈ సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పుడే విడుదల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించకుండా, కాస్త మెల్లగా ఫ్యాన్స్కు ఈ వార్త చేరేలా మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది.చిరు 150వ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఒక్కసారిగా విడుదల వాయిదా అని ప్రకటిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశ్యంతో మెగ వర్గాల వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్లో ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.