భారీ పబ్లిసిటీతో మోతమోగించారు.బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఊరించారు.
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలకి కూడా భారీగానే ఖర్చుపెట్టారు.కాని ఏమైంది ? మెగాస్టార్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఊహించని రీతిలో ఫ్లాప్ అయ్యింది.నమ్మడానికి కష్టంగా ఉన్నా, నమ్మకతప్పదు.
ముద్ద మందారం, కుంకుమ పువ్వు, కోయిలమ్మ, పున్నాగ లాంటి డైలీ సీరియల్స్ కి వస్తున్న టీఆర్పీ దగ్గరిలోకి కూడా మన మెగాస్టార్ టీవి షో రాకపోగా, యాంకర్ అనసూయ కూడా టీవి ప్రపంచంలో చిరంజీవిని ఓడించేసింది.
అనసూయ యాంకరింగ్ చేస్తున్న జాక్ పాట్ అనే టీవీషో కూడా, మీలో ఎవరు కోటీశ్వరుడు కొత్త సీజన్ కన్నా ఎక్కువగా చూపరులని ఆకర్షిస్తోంది.జాక్ పాట్ టీఆర్పీ 6.50 పాయింట్లు కాగా, మీలో ఎవరు కోటీశ్వరుడు 5.80 పాయింట్లతో సరిపెట్టుకుంటోంది.ఇక పైన చెప్పిన సీరియల్స్ ఈ షోలకి అందనంత దూరంలో ఉన్నాయి.
ఎవరు ఊహించలేదు ఈ ఫలితం.మరి స్టార్ మా ఈ సీజన్ ఎలాగో తప్పదు కాబట్టి, మెగాస్టార్ తో కానిచ్చి, తదుపరి సీజన్ మళ్ళీ నాగార్జునతోనే ప్లాన్ చేస్తుందా లేదా చూడాలి.