అల్లు రామలింగయ్య నేషనల్ అవార్డును ఈసారి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు ఇచ్చిన విషయం తెల్సిందే.తాజాగా దర్శకేంద్రుడికి ఈ అవార్డును ప్రధానం చేశారు.
ఆ వేడుకను మెగా ఫ్యామిలీ భారీ స్థాయిలో నిర్వహించింది.మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరు హృరోలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మెగా హీరోలు మరియు ఇతర గెస్టులు తమకు అల్లు రామలింగయ్య మరియు రాఘవేంద్ర రావుతో గల అనుబంధంను నెమరవేసుకున్నారు.అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తన ఫస్ట్ నైట్ అనుభవంను సభా ముఖంగా పంచుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ… సురేఖను పెళ్లి చేసుకున్న కొత్తలో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సి వచ్చింది.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతుంది.
అదే ట్రైన్లో దర్శకుడు రాఘవేంద్ర రావు మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా ప్రయాణించారు.చిరంజీవికి తెలియకుండా రైలులోని ఒక భోగిని ఫస్ట్నైట్ రూం మాదిరిగా తనదైన మార్క్తో రెడీ చేయించాడు.
ఆ తర్వాత ఆ రైలు బోగీని చూసి నేను సురేఖ షాక్ అయ్యాము అంటూ చెప్పుకొచ్చాడు.ఇలా తన హీరోల కోసం ఎన్నో ప్రత్యేక శ్రద్దలు తీసుకుని మరీ చూసుకుంటాడు అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
చిరంజీవి మరియు రాఘవేంద్ర రావుల కాంబినేషన్లో పలు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సక్సెస్ చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే.