మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ కొత్తగా మారనుందా ? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరు ఏపీలో ఆ పార్టీకి ఫ్యూచర్ లేకపోవడంతో తన ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారా ? ఈ క్రమంలోనే ఆయన్ను ఓ ఆఫర్ టెంప్ట్ చేస్తుందా ? అంటే ఏపీ రాజకీయ వర్గాల్లో రెండు రోజులుగా అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి.సినిమాల్లో మెగాస్టార్గా ఎదిగిన చిరు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
పొలిటికల్గా చిరు ప్లాప్ షో వేయడంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రి కూడా అయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాథినిత్యం వహిస్తోన్న చిరు కొద్ది రోజులుగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో బిజీ అవుతున్నారు.ఇక చిరు పలు పార్టీల్లోకి వెళతారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఇప్పుడు తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాలన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కాపులను దగ్గరకు చేర్చుకోవాలని పీకే చెప్పిన నేపథ్యంలో జగన్ అండ్ కో మెగాస్టార్పై గురి పెట్టినట్టు తెలుస్తోంది.చిరు వైసీపీలో చేరితే ఆయన రాజ్యసభ సీటును రెన్యువల్ చేస్తామని వైసీపీ నుంచి చిరుకు ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది.
చిరు తమ పార్టీలోకి వస్తే గ్లామర్ ఎట్రాక్షన్ యాడ్ అవ్వడంతో పాటు కాపుల్లో మెజార్టీ వర్గం తమకు దగ్గరవుతుందని వైసీపీ ప్లాన్గా తెలుస్తోంది.
ఈ మేరకు చిరు కోసం జగన్ రాయభారాలు కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక చిరు కూడా వైసీపీలో చేరాలా ? వద్దా ? అనే అంశంపై తర్జనభర్జనల్లో మునిగి తేలుతున్నారట.కాంగ్రెస్లో ఎలాగూ ఫ్యూచర్ లేదు.
వైసీపీలో రాజ్యసభ రెన్యువల్ ఆఫర్ ఉంది.దీంతో చిరు వైసీపీలో చేరేందుకు టెంప్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.