మెగాస్టార్ చిరంజీవి .ఈ పేరు చాలు థియేటర్ల ముందు ప్రేక్షకులని నిల్చోబెట్టడానికి.
దశాబ్దకాలం సినిమాలు వదిలేసి, తన కంబ్యాక్ లో ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు కూడా.కాని అదేంటో, ఆ మెగా మాయాజాలం వెండితెర మీద పనిచేసినట్టుగా, బుల్లితెర మీద పనిచేయలేకపోయింది.“మీలో ఎవరు కోటీశ్వరుడు” షోని నాగార్జున ఎక్కడికో తీసుకెళ్ళారు.టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ పొజిషన్ లో దీన్ని కూర్చోబెట్టి, మంచి గుడ్ విల్ తో చిరంజీవి చేతిలో పెట్టారు.
కొంచెం స్ట్రేయిట్ గా మాట్లాడుకుంటే, మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కాబట్టి, ఇక ఈ షోకి తిరుగేలేదు అని అనుకుంది “స్టార్ మా” యాజమాన్యం.కాని మొత్తం రివర్స్ అయ్యింది.
మొదటివారం నుంచే చిరంజీవి యాంకరింగ్ కి ఆదరణ కరువైంది.సీరియల్స్, జబర్దస్త్, అనసూయ యాంకరింగ్ చేసే గేమ్ షోలు, అన్ని మీలో ఎవరు కోటీశ్వరుడుని డామినేట్ చేసాయి.
అంతమంది సినిమా సెలబ్రీటీలను గెస్టులుగా పిలిచినా ఏం లాభం లేకుండాపోయింది.కాలక్రమంలో ఈ షో టీఅర్పీ రేటింగ్స్ దారుణమైన స్థాయికి పడిపోయాయి.
మా యాజమాన్యం చేసిన ప్రయోగం ఇటు ఛానెల్ వారికి, చిరంజీవికి, మెగా అభిమానులందరికి చేదు అనుభవాల్ని మిగిల్చింది.
చిరంజీవి హోస్ట్ చేసి తొలి సీజన్ సీజన్ ఇదే, చివరి సీజన్ కూడా ఇదే అంటున్నారు.
చిరంజీవి స్వయంగా ఓటమిని ఒప్పుకోని ఎందుకో ఇది క్లిక్ అవలేదు, ఇక చేయను అని అనేసారట.భవిష్యత్తులో మళ్ళీ టీవీలో హోస్ట్ గా కనిపించే ఉద్దేశం కూడా లేదట మెగాస్టార్ కి.మరి వచ్చే సీజన్ ని తిరిగి నాగార్జున చేతిలోనే పెడతారా లేక వెంకటేష్ లాంటి ఫ్యామిలి ఆడియెన్స్ సపోర్ట్ ఉన్న సీనియర్ కి షో బాధ్యతలు అప్పజెప్పుతారా చూడాలి.