కత్తి చిత్రం రాయడం మొదలుపెట్టినప్పటినుంచి కూల్ డ్రింక్స్ తాగడం మానేసానని, తన సెట్లో కూడా పెప్సి, కోకోకోలాకి అనుమతి లేదని నిన్న దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అందరు మెచ్చుకున్నా, చాలామందికి ఆశ్చర్యం కూడా కలిగింది.
అసలు మురుగదాస్ కూల్ డ్రింక్ కంపెనీల మీద పగబట్టడానికి కారణం ఏమిటి ? ఆ కంపెనీలు తమ ఫ్యాక్టరీల కోసం రైతుకి దక్కాల్సిన నీటి వనరులని దోచుకుంటున్నాయనే కదా.అదే విషయం మీదే “కత్తి” దూసారు మురుగదాస్.అదే చిత్తాన్ని ఇప్పుడు చిరంజీవి ఖైదీనం 150 పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటంటే, రైతుల మీద జాలితో కూల్ డ్రింక్స్ కంపెనీలపై విరుచుకుపడే మురుగదాస్ ప్రస్తుతం పనిచేస్తున్నది మహేష్ బాబుతో.
గత దశాబ్దకాలంగా థమ్సప్ కి బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తున్నాడు మహేష్.మరోవైపు చిరంజీవి కూడా థమ్సప్ ని కొన్నేళ్ళపాటు ప్రమోట్ చేసారు.అంతా చేసి కొత్త సినిమాలో కూల్ డ్రింక్ కంపెనీలపై పోరాటం చేసారు.
మరి మురుగదాస్ మాదిరిగా మన మెగాస్టార్ మరియు సూపర్ స్టార్ కి రైతుల మీద జాలి లేదా? ఆయన తన సినిమాలతో సమాజాన్ని మార్చాలనుకుంటున్నారు కాని మొదట మార్పు తేలవాల్సింది ఆయనతో పనిచేసే హీరోల మనసులో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి
.