తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించిన వైకాపా అధ్యక్షుడు జగన్కు ప్రతిపక్ష నేత కావటం తెలుగు ్రపజల దురదృష్టమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పవ్యాఖ్యానించారు.శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.రూ.46వేలకోట్ల జగన్ అవినీతీ ఆస్తులను గుర్తించిన ఈడీ అటాచ్ చేసుకుందని, తవి్వన కొద్దీ జగన్ అక్రమాస్తులు చూస్తుంటే ఎంతలా జనాన్ని దోచేసారో అర్ధం చేసుకోవచ్చన్నారు.ఇలాంటి నేత రెండేళ్లలో ముఖ్యమం్రతి అయిపోతున్నానని జ్యోతిష్యులతో చెప్పించుకుని ఊహల ఊయ్యాలూగారని, ఎద్దెవా చేసారు.ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత జగన్కు లేదని చినరాజప్ప విమర్శించారు.
జగన్ వైఖరిపై విసిగి వేసారిన ఆపార్టీ నేతలలో ఆంధ్రప్రదేశ్ పునర్వైభవానికి ముఖ్యమం్రతి చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించి, తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే, అర్థం లేని ఆరోపణలతో వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ్రపస్తుత ఈడీ అటాచ్ మెంట్ వ్యవహారంపై జగన్ ని నిలదీయాలని ఆయన వైకాపా నేతలకు సూచించారు.
గోదావరి జిల్లాలలో పంట విరామం జరుగుతోందంటూ విపక్షం అభూత కల్పనలు సృష్టిస్తోందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ్రపతి ఎకరాకు నీరందించేలా చూస్తున్నట్టు తెలిపారు
న్యాయ వ్యవస్థలోకి ప్రాంతీయ, కులతత్వాలను చొప్పించి రాజకీయ లబ్దిపొందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని, పాలన గొప్పగా ఉందని ప్రచారం చేసుకుంటునే, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేజల, న్యాయ వివాదాలు కేసీఆర్ తెరపైకి తెస్తున్నారని అంతా ్రగహించాలన్నారు ఎపి హోంమంత్రి చినరాజప్ప.