మెగా హీరో వరుణ్ తేజ్తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘లోఫర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.మొదటగా ప్రచారం జరిగిన దాని ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగస్వామిగా ఉంటుందని అనుకున్నారు.
ఛార్మి నిర్మాణంలో పాలు పంచుకోవడం వల్లే నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అని, ఆయన తప్పుకోవడంతో వారి వద్ద డబ్బులు లేవు అందుకే సినిమా నుండి తప్పుకున్నారు అంటూ ఛార్మి కామెంట్స్ చేసింది.నితిన్ తప్పుకోవడంతో అదే సినిమాను వరుణ్తేజ్తో చేసేందుకు పూరి సిద్దం అయ్యాడు.
ఛార్మి మొదటి సారి నిర్మాతగా మారి నిర్మించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకు మంచి లాభాలే వచ్చాయి.దాంతో మరోసారి నిర్మాతగా వ్యవహరించాలని ఛార్మి కోరుకుంది.
అందుకే పూరి తన తర్వాత సినిమాకు కూడా ఛార్మి నిర్మాత అయ్యే అవకాశాన్ని ఇస్తాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఛార్మిని మెగా మూవీ ‘లోఫర్’ నుండి తప్పించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నితిన్ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో ఛార్మి, పూరిల వ్యవహారంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.దాంతో ఛార్మిని దూరంగా ఉంచడం మంచిదనే నిర్ణయానికి పూరి వచ్చాడని, అందుకే ఈ సినిమాను సి.కళ్యాణ్ సోలోగా నిర్మిస్తున్నాడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.