టాలీవుడ్లో మహా మహా అంటూ ఉర్రూతలూగించిన హాట్ బ్యూటీ చార్మి ప్రస్తుతం కెరీర్ను ఇబ్బందుల్లో నెట్టుకు వస్తున్న విషయం తెల్సిందే.ఈమెకు గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేదు, అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
అయితే ఉన్నట్లుండి ఈమె దశ తిరిగి పోయింది.ఈమెతో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘జ్యోతి లక్ష్మి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఆ సినిమాపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.ఆ సినిమాతో పాటు ఈమె తమిళంలో స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది.
చార్మి చేయబోతున్న ఆ తమిళ ఐటెం సాంగ్కు ఏకంగా 30 లక్షల పారితోషికం తీసుకుంటుంది.30 లక్షల పారితోషికం అంటే చాలా తక్కువే అన్నట్లు.కాని ప్రస్తుతం చార్మి కెరీర్ పరంగా, క్రేజ్ పరంగా చాలా వెనుక బడి ఉంది.ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం పారితోషికంగా పొందడం ఈ అమ్మడి అదృష్టం అంటున్నారు.
తెలుగులో కూడా ఈమెకు ఐటెం ఆఫర్లు వస్తున్నాయి.కాని అయిదు పది లక్షలు పారితోషికం ఇస్తామనడంతో చార్మి వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తోంది.తమిళంలో ఈమె ఐటెంకు 30 లక్షలు వస్తుండటంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతోంది.9 నిమిషాల పాటు ఐటెం సాంగ్ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.