మెగా హీరోలు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్లు కలిసి ఇప్పటికే ‘ఎవడు’ అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో వీరిద్దరు ఫుల్ లెంగ్త్లో కనిపించక పోవడంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంకు గురయ్యారు.
అది కాకుండా ఆ చిత్రంలో అల్లు అర్జున్ కేవలం గెస్ట్ రోల్లో మాత్రమే నటించడం జరిగింది.అయితే మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే వీరిద్దరు కూడా విడి విడిగా ప్రకటించారు.
అయితే ఆ సినిమా ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మెగా నిర్మాణ సంస్థ అయిన గీతాఆర్ట్స్ సంస్థ ఫిల్మ్ చాంబర్లో ‘చరణ్`అర్జున్’ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా మెగా మల్టీస్టారర్ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.తాజాగా ఈ టైటిల్ రిజిస్ట్రర్ అవ్వడంతో అతి త్వరలోనే మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకు ప్రముఖ యాక్షన్ చిత్రాల దర్శకుడు వినాయక్ దర్శకత్వం వహించే అవకాశముంది.మెగా మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లాలి అంటే మరో సంవత్సర కాలం అయినా ఎదురు చూడాల్సి ఉంది.