ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది.అన్నీ కుదిరితే ఈ వారంలోనే కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది.
ముహూర్తం విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోయినా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పడంతో ఎవర్ ఇన్ ? ఎవరు అవుట్ ? అన్నది ఇప్పుడు కాస్త ఉత్కంఠగా మారింది.బాబు అంతర్గత సర్వేల్లో మంచి మార్కులు రాని వారిని నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తారని తెలుస్తోంది.
ఆరోపణలు, పనితీరు సరిగా లేని మంత్రుల జాబితాలో పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్బాబు తదితర మంత్రులు ఉన్నారు.ఈ నేపథ్యంలో మాకు తిరుగులేదు అనుకున్న మంత్రుల సీట్లు సైతం కదిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరితో పాటు నిమ్మకాయల చినరాజప్ప, మృణాళిని, అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు విషయంలో చంద్రబాబు విసిగిపోయారని సమాచారం.
ఈ మంత్రుల్లో చాలా మందికి ఇప్పటకీ తమ శాఖలపై పట్టులేదు సరికదా.? ఏం జరుగుతుందో ? కూడా వారికే తెలియని పరిస్థితి.ఇక కొత్తగా కేబినెట్లోకి వస్తారని భావిస్తోన్న వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, వైకాపా నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూతో పాటు వంగలపూడి అనిత, పితాని సత్యనారాయణ, బీద రవిచంద్ర, వర్ల రామయ్య పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి.
కర్నూలు నుంచి వైకాపా తరఫున గెలిచి సైకిలెక్కిన భూమా నాగిరెడ్డికి సీటు ఖరారైందని టాక్.మరి ఫైనల్గా వీరిలో ఎవరు ఇన్ అవుతారో ? ఎవరు అవుట్ ? అవుతారో చూడాలి.