ఏపీ సీఎం చంద్రబాబుకు పార్టీలోను, ప్రభుత్వంలోను తిరుగులేని గ్రిప్ ఉంది.అక్కడా.
ఇక్కడా ఆయన చెప్పిందే వేదం.బాబు గతంలో పని చేసినప్పుడు, ఇప్పుడు ఈ విషయాల్లో మాత్రం ఆయనకు తిరుగులేదు.
అయితే చంద్రబాబు గత పదేళ్లు సీఎంగా ఉన్నప్పటకీ ఇప్పటకీ ఓ విషయంలో మాత్రం అట్టర్ ప్లాప్ అయిపోతున్నారు.బాబుకు నాటికి నేటికి తేడాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి.
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పార్టీలో అంతర్గత క్రమశిక్షణ, నేతల మధ్య సమన్వయం చక్కగా ఉండేది.ఇప్పుడు ఈ రెండు మిస్ అయ్యాయి.
పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.పార్టీ అధినేత ఆదేశాలను సైతం ధిక్కరించేస్తున్నారు.
తన మాటను లెక్కచేయని వారిపై చంద్రబాబు సైతం ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితి.ఇక చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు తయారయ్యాయి.
ఈ గ్రూపులు సొంత పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నేతల మధ్య ఉన్నాయి.వైసీపీలో నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చి నేతలు, టీడీపీ పాత కాపుల మధ్యా కొనసాగుతున్నాయి.ఈ వర్గాల మధ్య విబేధాల ఇష్యూలో చంద్రబాబు వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ రెండు వర్గాల్లో ఏదో ఒక వర్గంతోనే వెళ్లనున్నట్టు క్లీయర్గా తెలిసిపోతోంది.రెండు వర్గాలనూ కూర్చోబెట్టి సంధి కుదిర్చే ప్రయత్నం చేసే విషయంలో బాబు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు.
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవికుమార్, జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి, కడపలో సీఎం రమేశ్ వర్సెస్ శ్రీనివాసులరెడ్డి, విశాఖలో మంత్రులు గంటా వర్సెస్ అయ్యన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గొడవలకు లెక్కేలేదు.
దేశంలో ఉత్తమ క్రమశిక్షణ కలపార్టీ అని గొప్పలు పోయే టీడీపీ నేతలు ఈ గొడవలకు ఏమని ఆన్సర్ చెపుతారో ? ఇక చంద్రబాబు సైతం నేతల మధ్య సమన్వయం కుదిర్చే విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పక తప్పదు.