మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ 21 సంవత్సరాల తర్వాత తెలుగులో చిత్రం చేయబోతున్నాడు.బాలకృష్ణ హీరోగా నటించిన ‘గాంఢీవం’ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కూడా మోహన్లాల్ తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తెలుగులో పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ యేలేటి 21 సంవత్సరాల తర్వాత మోహన్లాల్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
‘ఈగ’ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో ఏక కాలంతో తెరకెక్కబోతుంది.ఇప్పటికే ఈ చిత్రం కోసం కథను యేలేటి సిద్దం చేశాడు.
ఆ కథ మూడు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.అందుకే ఈ చిత్రాన్ని నమ్మకంతో ఒకే సారి మూడు భాషల్లో తెరకెక్కించబోతున్నాడు.
ఈ చిత్రంలో మూడు భాషల్లో కూడా మోహన్లాల్కు జోడీగా నిన్నటి తరం హీరోయిన్ గౌతమి నటించనుంది.ఇటీవలే తమిళ ‘పాపవినాశం’ చిత్రంతో గౌతమి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.