భాజపా ఎంపీ, మాజీ హీరోయిన్ హేమమాలినికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమిటి సంబంధం? ఏమీ సంబంధం లేదు.కాకపోతే వీరి వాహనాల కారణంగా ఇద్దరు చనిపోయారు.
రాజస్థాన్లో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో హేమ తీవ్రంగా గాయపడటమే కాకుండా ఐదేళ్ల పాప చనిపోయింది.ఆమె కారు డ్రైవరును అరెస్టు చేశారు కూడా.
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్లోని (రక్షణ వాహన శ్రేణి) ఒక వాహనం ఢీకొని డెబ్బయ్ ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది.పోలవరం పంచాయతీలోని ఎడ్లగూడెంలో ఈ దారుణం జరిగింది.
ఈ గ్రామానికే చెందిన మృతురాలి పేరు యర్లపాటి మంగమ్మ.ఈమె, దేవులమ్మ అనే మహిళ రోడ్డు పక్కన నిల్చుని ఉండగా కాన్వాయ్లోని ఒక వాహనం వీరిని ఢీకొట్టింది.
మంగమ్మ చనిపోగా, దేవులమ్మ తీవ్రంగా గాయపడింది.ఈమెను రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు.
దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు మంగమ్మ కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
గాయపడిన మహిళకు వైద్యం కోసం రెండున్నర లక్షల సాయం ప్రకటించారు.హేమమాలిని కారు ప్రమాదానికి గురవడానికి అతి వేగమే కారణమని అధికారులు చెప్పారు.
చంద్రబాబు కాన్వాయ్లోని వాహనం మహిళను ఢీకొట్టడానికి కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదు.ప్రముఖుల వాహనాలు ఢీకొని గతంలోనూ కొందరు చనిపోయిన, గాయపడిన ఘటనలు ఉన్నాయి.