బాబును చిర్రెత్తించిన జేసి సోదరులు

ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు పిలిచినా,వెళ్లి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు .చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లె ప్రజల దాహం తీరిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

 Chandrababu Warning To Jc-TeluguStop.com

పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు అవసరమా? అంత అవసరం లేదు అని వ్యాఖ్యానించారు రెండు జిల్లాల రైతులు కోరితేనే తన సోదరుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అక్కడకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు.అలాగే మరో ప్రధాన సమస్య ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడం వల్ల రవాణ రంగం తెరుకోలేని విధంగా కుదేలు అయిపోతుంది .కనుక తెలంగాణా సర్కార్ వేసిన పన్నులు తీసేయాలి అని డిమాండ్ చేసారు ఈ అంశంపై కోర్టులో న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నట్లు ప్రభాకరరెడ్డి తెలిపారు.అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) కు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామిని బాల సోమవారం గండి కొట్టిన విషయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీసింది .దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ ఘటనపై సమాచారం తెలుసుకుని… జేసీ సోదరులతో ఫోన్లో మాట్లాడారు.ఇలా మీకు మీరే స్వంత ఆలోచనలు చేసేసి స్వంత నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి అని చంద్రబాబు జేసీ సోదరులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆపార్టీ వారే చెబుతున్నారు.

సింగపూర్ నుంచి రాగానే వచ్చి కలిసి మాట్లాడుదామని బాబుజేసీ సోదరులకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube