దాదాపు నాలుగు గంటలకి పైగా చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గ సమావేశాన్ని సాగించారు.
ఈ విషయం లో రకరకాల అంశాల మీద మాట్లాడిన చంద్రబాబు ఏపీ రాజధాని భూముల విషయం లో ప్రభుత్వ రంగ సంస్థలకి వాటిని అప్పజెప్పడం విషయం లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఏపీ లో ఉన్న రాజకీయ పార్టీలకి కూడా భూములు ఇవ్వాలు అనే అంశం చర్చకు వచ్చింది.
పలువురు మంత్రులు కాంగ్రెస్ కి అసలు భూమి ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు అని కోరగా మరికొందరు కాంగ్రెస్ కేంద్రం లో చేసిన తప్పుకి రాష్ట్రం లో వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నారు.
రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా.ప్రధాన పార్టీలకు ఎంతోకొంత భూమిని కేటాయించటం సమంజసంగా ఉంటుందన్న మాటను చెప్పారని చెబుతున్నారు.
ఈ విషయం తెలిసిన వారంతా.కాంగ్రెస్ విషయంలో ఏపీ మంత్రులు మరి ఇంత కటువుగా ఉన్నారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది.
అదే సమయంలో చంద్రబాబు.తన మంత్రుల మాటల్ని బలపర్చకుండా.పెద్దమనిషి తరహాలో మాట చెప్పారన్న మాటను కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.