ఏపీ సీఎం చంద్రబాబు ఏ ముహూర్తాన మంత్రివర్గ ప్రక్షాళన చేశారో గాని అప్పటి నుంచి అన్ని జిల్లాల్లోను టీడీపీ వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు ఆకాశాన్ని టచ్ చేస్తున్నాయి.సీనియర్లు అలకబూనడం, వారికి బుజ్జగింపులు, హామీలతోనే చంద్రబాబుకు పుణ్యకాలం కాస్తా సరిపోతోంది.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఇప్పుడు సొంత జిల్లాలోనే వరుసగా షాకులు తగులుతున్నాయి.
ఇప్పటికే గల్లా అరుణకుమారి బాబుపై అసంతృప్తితో ఉన్నారు.
ఇక మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు రగిలిపోతున్నారు.ఇక వీరిద్దరి సంగతి ఇలా ఉంటే పార్టీలో సీనియర్, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా బాబుపై ఓపెన్గానే ఫైరైపోతున్నారు.
చంద్రబాబుకు ఈ సీనియర్లకు బాగా గ్యాప్ పెరిగిపోయింది.ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్ డుమ్మా కొట్టడంతో వీరి మధ్య గ్యాప్ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇక ఏర్పేడు ఘటన కూడా జిల్లాలో చంద్రబాబుకు పెద్ద మైనస్గా మారింది.ఇక టీటీడీ చైర్మన్ పదవి రెన్యువల్ చేయకపోవడంతో ఆయన సైతం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.
ఇలా చూస్తే చంద్రబాబు సొంత జిల్లాలో సీనియర్లు అందరూ చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో రగలడంతో పాటు ఆయనకు దూరమవుతున్నారు.వీరి సమస్యలన్నింటిని చంద్రబాబు వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే.
గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే చర్చలు చిత్తూరు పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి.