లోకేష్ కి క్లాస్.. పీకిన చంద్రబాబు...

ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నా.రేవంత్ ఇష్యూ తో తన మైండ్ అంతా ఇక్కడే తిరుగుతోంది.

 Chandrababu Fires On Lokesh-TeluguStop.com

రేవంత్ లాంటి వ్యకి.తెలంగాణా లో పార్టీని వీడితే తెలుగుదేశానికి తెలంగాణాలో తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది వాస్తవం.

రేవంత్ పార్టీని వీడటం ఖాయం అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశానికి రావడం ఆసక్తికరమైన అంశం ఇక్కడ వరకు బాగానే నడిచినా ఇక్కడే చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకు పడ్డారట.అమెరికా నుంచీ ఫోను చేసి మరి తలంటే శారు తనయుడు లోకేష్ కి.ఎందుకు లోకేష్ కి అంతగా క్లాస్ పీకారు అంటే.

విషయమేమిటంటే.

తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లోకేష్ కు గట్టిగా క్లాస్ ఇచ్చాడట బాబు.తను అందుబాటులో లేని సమయంలో ఇక్కడ జరుగుతున్నవిషయాలకి సంభవించిన గొడవలు ముదిరిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉండి కూడా.ఈ వ్యవహారాలను పరిష్కరించకుండా , కనీసం వాటిలోకి జోక్యం కూడా చేసుకోకుండా లోకేష్ ఉండటం బాబుకి కోపం తెప్పించిందట.

ఈ విషయంలోనే బాబు లోకేష్ మీద తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీలో ప్రతేఒక్కరు ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి తెలుగుదేశంపార్టీని వీడతాడు అనే వార్తలు రావడం.రేవంత్ టిడీపి మంత్రులమీద చేసిన విమర్సల నేపద్యంలో లోకేష్ హైదరాబాద్ వచ్చారు.లోకేష్ రాకతో ఇక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు అందరు .అదే సమయంలో టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడంతో ఈ మీటింగ్ కు లోకేష్ కూడా హాజరవుతాడని అంతా అనుకున్నారు.అనూహ్యంగా ఆ కార్యక్రమానికి రేవంత్ కూడా హాజరు అయ్యాడు.ఇదంతా లోకేష్ మంత్రాంగమే.రేవంత్ ను సముదాయించడానికి లోకేష్ వచ్చాడని, ఈ వ్యవహారాన్ని ఇక లోకేష్ బాబు పరిష్కరించేస్తాడని టీటీడీపీ వాళ్లు ఆశించారు.కానీ సీన్ అలా కనిపించలేదు.

లోకేష్ బాబు టీటీడీపీ వర్కింగ్ కమిటీ మీటింగ్ కు హాజరే కాలేదు! రేవంత్ ను పిలిపించుకుని మాట్లాడటం, సముదాయించడం మాట అటుంచితే.కనీసం ఆ మీటింగ్ కే లోకేష్ హాజరు కాలేదు.

ఇక రేవంత్ తో చర్చలు జరిపే ప్రయత్నం కానీ, ఇతరులతో మాట్లాడి రేవంత్ ని సముదాయించే యత్నం లాంటివి లోకేష్ చేయలేదు.

అసలు లోకేష్ అంత హుటాహుటిగా విజయవాడ నుంచీ హైదరాబాద్ ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాలేదు అక్కడ ఉన్న నాయకులకి.

ఈ విషయాలన్నీ తెలుసుకున్న చంద్రబాబు కి తీవ్ర ఆగ్రహం వచ్చిందట.హైదరాబాద్ లో ఉండి కూడా లోకేష్ అక్కడ జరుగుతున్న సమస్యలని పరిష్కరించలేక పోవడం.

పరిస్థితులు చేయిదాటి పోవడంతో.చంద్రబాబు కి చాలా కోపం వచ్చిందని టాక్.

దీంతో అమెరికా నుంచినే ఫోన్ చేసి లోకేష్ కు క్లాస్ పీకాడట.వర్కింగ్ కమిటీ మీటింగ్ కు హాజరు కావాల్సింది అంటూ.

ఎందుకు హాజరు కాలేదు.అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube