ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వివాదం చూస్తుంటే ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహం వస్తోంది.ఆస్తుల కోసం చక్రి మరణం తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు చేస్తున్న వివాదంతో అంతా కూడా విస్తు పోతున్నారు.
చక్రి చనిపోయిన కొన్ని రోజుల్లోనే ఆయన భార్య శ్రావణి మానవ హక్కుల కమీషన్లో తనకు భద్రత లేదంటూ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తన మాట మార్చి అంతా బాగానే ఉన్నాం అంటూ ప్రకటించింది.
తాజాగా తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన అత్తా మరియు మరిది తన భర్య చక్రిని చంపి ఉంటారని, ఆయనపై విష ప్రయోగం చేశారేమో అనే అనుమానాలు వ్యక్తం చేసింది.
దాంతో విచారణ మొదలు పెట్టిన పోలీసులకు మరో షాక్ తగిలింది.చక్రిని ఆయన భార్య శ్రావణి చంపిందంటూ ఆయన తల్లి మరియు తమ్ముడు ఇతర కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.
శ్రావణి కుటుంబం నుండి తమకు ప్రాణ హని కూడా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.చక్రి మరణించిన తర్వాత తాను చక్రిని చంపేశానంటూ శ్రావణి తమకు పోన్ చేసిందని, ఆమె కాల్ లీస్ట్ చూస్తే తెలుస్తుందని అన్నారు.
ఈ వివాదంతో పోలీసులు మొత్తం చక్రి మరణంపై ఎం చేయాలో పాలు పోక తలలు పట్టుకున్నారు.