టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పోస్టింగ్ ఊస్టింగ్ కానుందా ? టీటీడీకి కొత్త చైర్మన్ వస్తున్నారా ? అంటే ఏపీ పొలిటికల్ ఇన్నర్ సైడ్ వర్గాల్లో అవుననే ఆన్సర్ వినిపిస్తోంది.చదలవాడ పేరు చెపితేనే సీఎం చంద్రబాబు మండిపడుతున్నారట.
గత కొద్ది రోజులుగా చదలవాడకు – చంద్రబాబుకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది.దీనిని తగ్గించుకునేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.
తాజాగా మరోసారి చదలవాడ పెద్ద ఇరకాటంలో పడ్డారు.చివరకు దీనికి సమాధానం చెప్పుకోవడానికి ఆయన ఆగమాగమవుతున్నారు.
చదలవాడకు ఈ సారి భార్య వల్ల చీవాట్లు తప్పేలా లేవు.చదలవాడ భార్య సుచరిత టీడీపీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఆశించారు.
చదలవాడపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు ఆమెకు టిక్కెట్టు ఇవ్వలేదు.
అయితే ఆమె స్వత్రంత్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ప్రచారం కూడా చేశారు.తీరా ఎన్నికల ముందు రోజు ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.
టీడీపీ అభ్యర్థికే మద్దతు పలికారు.అయితే అప్పటికే చంద్రబాబు వద్ద చదలవాడకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చదలవాడే తెరవెనక ఉండి ఈ గేమ్ ఆడించారని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబుకు రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి దక్కడం కష్టమే అన్న టాక్ వచ్చేసింది.
ఇక ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తోన్న గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావకు ఇస్తారని తెలుస్తోంది.