బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు.గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ కథానాయికలు.
ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఎమ్మెల్యేగా నడిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కాని ఎమ్మెల్యేగా నటిస్తున్నది రకుల్ ప్రీత్ కాదు, కెథరిన్ అని తాజా వార్త.ఎదో రకుల్ తో పాటు మరో కథానాయికగా కనిపించే పాత్ర కాదు కెథరిన్ ది అని సమాచారం.
కథలో చాలా కీలకమైన పాత్రలో కెథరిన్ కనిపించనుంది.
ప్రస్తుతం రామోజి ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తొలిసారి పూర్తి నిడివి పాత్ర పోషిస్తున్నారు అల్లు అర్జున్.
త్వరలొనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసి వచ్చే వెసవిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.