మాజీ ఎం.ఎల్.
ఏ పయ్యావుల కేశవ్, గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే.అయితే అలా ఓటమి పాలైన నేతలందరికి మంచి రోజులు రానున్నాయని తెలుస్తుందు.
ఏ.పీ పునర్విభజన చట్టానికి సంబందించి నిన్న అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన అలా ఓటమిపాలైన నేతలకు మంత్రి పదవులపై ఆశలు కల్పించింది.ఆ ప్రకటన పుణ్యమా అంటూ ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో మరో 8మందికి చోటు దక్కే అవకాశం ఉంది, అదీ కూడా ఎం.ఎల్.సీ కోటాలో.అయితే ఈ కోటాలో ముందుగా ఉన్న లీడర్ అనంతపురం ఉరవకొండ టైగర్ “పయ్యావుల కేశవ్”.
పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో అప్పటి పాలక పక్షంపై ఎదురుదాడిలో ఈయన కీలక పాత్ర పోషించడంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి దక్కుతుంది అని అందరూ ఆలోచించారు.కానీ ఆయన ఓటమి పాలు కావడంతో చేసేదేమీ లేక ఇంటికే పరిమితం అవగా, చంద్రబాబు ఆయనకు ఎం.ఎల్.సీ ఇస్తాను అంటూ ఊరిస్తూ రావడం, అరుణ్ జైట్లీ ప్రకటనలో మరో 8మందికి అవకాశం దక్కే ప్రకటన వెలువడటంతో అందరి దృష్టీ పయ్యావులపైనే పడింది.మరి చంద్రబాబు ఆలోచన ఏమిటో తెలీదు కానీ.అసలైతే పయ్యావుల కన్నా గాలి ముద్దు కృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి వంటి సీనియర్ లీడర్స్ ముందు వరుసలో ఉంటారు అని గమనించాల్సిన విషయం.