మంచు లక్ష్మి తాజాగా నటించిన ‘బుడుగు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత మరియు దర్శకుడు ప్రమోషన్కు మంచు లక్ష్మి సహకరించడం లేదు అంటూ ఏకంగా మీడియా ముందు గగ్గొలు పెట్టారు.
తమను ఆదుకోవాలంటూ కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలను నిర్మాతలు కలిసినట్లుగా ప్రచారం జరిగింది.అయితే తాజాగా దర్శక నిర్మాతలు హీరోయిన్ మంచు లక్ష్మితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ మధ్య విభేదాలు లేవు అంటూ గ్యాస్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా వీరి మధ్య వివాదం సర్దుమనిగిందేమో ఏమో లేక, తనపై వేసిన అబాండాలకు సమాధానం చెప్పాలంటూ నిర్మాతకు మంచు లక్ష్మి హెచ్చరికలు జారీ చేసిందో ఏమో కాని ఉన్నట్లుండి తమ వాయిస్ను మార్చారు.ఈ సినిమా కోసం మంచు లక్ష్మి చాలా కష్ట పడ్డారు అని, ఈ సినిమాకు ఇంతగా పేరు వచ్చినందుకు కారణం మంచు లక్ష్మి మాత్రమే అంటూ పొగడ్తలతో ముంచెతుతున్నారు.
ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు మంచు లక్ష్మి గురించి నాలుగు మంచి మాటలు చెబుతున్నారు.దానికి తోడు ‘బుడుగు’ సక్సెస్ అవ్వడంతో ‘బుడుగు`2’ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.
దీంట్లో కూడా మంచు లక్ష్మి హీరోయిన్గా నటిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.ఈ రెండవ పార్ట్ గురించి ఏమో కాని, మొదటి పార్ట్ ప్రమోషన్ సరిగా చేయడం అంటున్నారు సినీ వర్గాల వారు.
మంచు లక్ష్మిపై పడ్డ అపవాదును తొలగించేందుకు ఈ ప్రయత్నం అని తెలుస్తోంది.