మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం ఇప్పటికే భారి డిజాస్టర్ అనే ముద్ర వేయించుకుంది.ఏమాత్రం పసలేని కలెక్షన్లు చూసి దిగులుపడిన పంపిణీదారులకి నిర్మాత పివిపి నుండి పిలుపు అందింది.
దాంతో డిస్ట్రిబ్యూటర్లంతా వెళ్ళి నిన్న నిర్మాతను కలిసారు.
తాము మళ్ళీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నామని, దానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని, వచ్చే ఎడాది విడుదలకు ప్లాన్ చేసి, ఆ సినిమాతో నష్టపరిహారం అందిస్తామని పివిపి ఒక ప్రపోజల్ బయ్యర్ల ముందు ఉంచితే, దాన్ని పూర్తిగా నిరాకరించారట పంపిణీదారులు.
దీనికి కారణం, పివిపి చెప్పిన ప్రపోజల్ నమ్మశక్యంగా లేకపోవడమే.ఎందుకంటే మహేష్ తదుపరి చిత్రం మురుగదాస్ తో ఫిక్స్ అయిపోయింది.
ఆ సినిమా పూర్తయ్యి విడుదల కావడానికే ఒక ఏడాది పడుతుంది.ఆ తరువాత పూరి జగన్నాథ్ సినిమా లైన్ లో ఉంది.
చాలాసేపు జరిగిన చర్చలు చివరకు ఓ నిర్ణయంతో ముగిసాయి.అదేటంటే, కనీసం 40% శాతం నష్టాలు ఏ డిస్ట్రిబ్యూటర్ కి అయితే వస్తాయో, వారికి మాత్రమే నష్టపరిహారం పివిపి చెల్లిస్తుందని టాక్.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఇదే బయ్యర్లు, నిర్మాత మధ్య కుదిరిన డీల్.మరి ఇక్కడితో ఈ గొడవ ఆగిపోతుందో లేక ఇంకేదైనా మలుపు తిరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.